Application process for fee reimbursement begins | ఫీజు రీయింబర్మెంట్ కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Andhrapradesh Government Fee Reimbursement Scheme : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బి.టెక్, డిగ్రీ , ఐటిఐ, డిప్లొమా , పీజీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు గమనిక ! ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

2025 – 26 విద్యా సంవత్సరం తో పాటు 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ మీ గ్రామ, వార్డు సచివాలయం లలో జరుగుతుంది.

ఈ అంశానికి సంబంధించి విద్యార్థుల పేర్లు వెరిఫికేషన్ కొరకు వచ్చాయా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి ? వెరిఫికేషన్ కొరకు అవసరమగు ధృవ పత్రాలు ఏమిటి ? సచివాలయం లో వెరిఫికేషన్ కి రాకపోతే ఏం చేయాలి అన్న విషయాలు ను ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది.

🔥 ఆంధ్రప్రదేశ్ ఫీజు రీయింబర్మెంట్ పథకం (RTF & MTF) :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమ పథకాల్లో భాగంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
  • ఈ పథకం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటుగా ఇతర హాస్టల్ ఖర్చులకు కూడా నగదు ను ఇస్తుంది.

🔥 Fee Reimbursement Scheme కు ఎవరు అర్హులు :

  • ప్రభుత్వ / ఎయిడెడ్ / ప్రైవేట్ కళాశాలలు , రాష్ట్ర బోర్డు కి అఫిలేటెడ్ గా ఉన్న యూనివర్సిటీ లలో పాలిటెక్నిక్ , ఐటిఐ , డిగ్రీ మరియు ఇతర ఉన్నత కోర్సులను అభ్యసిస్తున్న వారు అర్హులు అవుతారు.
  • డే స్కాలర్ విద్యార్థులు , కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు , డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ లలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు. మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఈ పథకానికి అర్హులు కారు.
  • విద్యార్థి యొక్క హాజరు శాతం 75% కంటే అధికంగా ఉండాలి.

తల్లికి వందనం పథకం కొత్త జాబితా విడుదల చేశారు – Click here

🔥 Fee Reimbursement Scheme కు ఎవరు అనర్హులు :

  • ప్రైవేట్ యూనివర్సిటీ లు / డీమ్డ్ యూనివర్సిటీ లలో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.
  • కరెస్పాండెన్ / డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సు లలో చదువుతున్న వారు ఈ పథకం క్రింద లబ్ది పొందలేరు.
  • మేనేజ్మెంట్ / స్పాట్ కోటా క్రింద అడ్మిట్ అయిన విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.

🔥అవసరమగు అర్హత ప్రమాణాలు (Required eligibility criteria for Fee Reimbursement Scheme) :

  • ఈ పథకానికి అర్హత పొందేందుకు గాను కుటుంబ ఆదాయ పరిమితి సంవత్సరానికి 2.50 లక్షల కంటే తక్కువ గా వుండాలి.
  • కుటుంబానికి సంబంధించి పూర్తి భూ పరిమితి మాగాణి అయితే 10 ఎకరాల లోపు & మెట్ట భూమి అయితే 25 ఎకరాల లోపు & మెట్ట మరియు మాగాణి రెండు కలిపి 25 ఎకరాల లోపు కలిగి వుండాలి.
  • కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి / ప్రభుత్వ పెన్షన్ దారు ఉండరాదు. పారిశుధ్య కార్మికులు కి మినహాయింపు కలదు.
  • కుటుంబానికి ఎటువంటి నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. (టాక్సీలు / ట్రాక్టర్లు /ఆటోలు కి మినహాయింపు కలదు.)
  • కుటుంబానికి 1500 చదరపు అడుగులు కంటే తక్కువ మున్సిపల్ ప్రాపర్టీ ( రెసిడెన్షియల్ / కమర్షియల్ ) కలిగి వుండాలి.
  • కుటుంబం లో ఎవరూ ఆదాయ పన్ను చెల్లింపు దారులు ఉండరాదు.

పదో తరగతి అర్హతతో 4987 ఉద్యోగాలు – Click here

🔥దరఖాస్తు విధానం (How to Apply AP Fee Reimbursement Scheme) :

  • విద్యార్థులు ముందుగా వారు చదువుతున్న కాలేజీ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
  • దరఖాస్తు ఫారం ను జ్ఞానభూమి వెబ్సైట్ నుండి లేదా కాలేజ్ నుండి పొందవచ్చు.
  • సంబంధిత దరఖాస్తు ను ఫిల్ చేసి , కాలేజ్ వారికి అందజేయాలి.
  • కాలేజ్ యాజమాన్యం దరాఖస్తును వెరిఫై చేసి , దరఖాస్తును అధికారిక పోర్టల్ నందు సబ్మిట్ చేస్తారు.

🔥వెరిఫికేషన్ ప్రక్రియ :

  • కాలేజ్ నుండి నమోదు కాబడిన దరఖాస్తు , అర్హత ప్రమాణాలు వెరిఫికేషన్ కొరకు సంబంధిత గ్రామ , వార్డు సచివాలయం లాగిన్ కి పంపించబడుతుంది.
  • సంబంధిత గ్రామ వార్డు సచివాలయం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ / వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ స్టూడెంట్ యొక్క వివరాలను వెరిఫై చేస్తారు.

🔥 వెరిఫికేషన్ కొరకు అవసరమగు ధ్రువపత్రాలు (Required Documents for Fee Reimbursement) :

  • 1.కుటుంబం యొక్క ఆధార్ కార్డులు
  • 2.రైస్ కార్డ్
  • 3. విద్యార్థి తల్లి మరియు స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్ (SC విద్యార్థులు అయితే తల్లి ఆధార్ కి లింక్ కాబడిన అకౌంట్)
  • 4.కుల ధ్రువీకరణ పత్రం
  • 5.ఆదాయ ధ్రువీకరణ పత్రం

సంబంధిత ధ్రువపత్రాలు ను తీసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ను వెరిఫై చేయించుకోవాలి.

🔥 ప్రారంభం అయిన ఫీజు రీయింబర్స్మెంట్ (RTF & MTF) వెరిఫికేషన్ ప్రక్రియ :

  • 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి రీయింబర్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ (RTF) సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయవలసిన విద్యార్థులు జాబితాను జ్ఞానభూమి పోర్టల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ నందు పొందుపరచడం జరిగింది.
  • 2025 – 26 విద్యా సంవత్సరంతో పాటుగా 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్ విద్యార్థుల సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ ను కూడా పూర్తి చేయాల్సి ఉంది.
  • విద్యార్థులు యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి వీలైనంత త్వరగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోగలరు.

🔥పథకం ద్వారా చేకూరే లబ్ది :

  • ఈ పథకానికి సంబంధించి RTF ద్వారా అర్హత కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కాలేజీ ఫీజును రియంబర్స్ చేస్తుంది.
  • అలానే MTF పథకం ద్వారా డిగ్రీ మరియు ఉన్నత చదువులు చదువుతున్న వారికి సంవత్సరానికి 20,000/- రూపాయలు & డిప్లొమా / పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000/- రూపాయలు & ఐటిఐ విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున అందిస్తుంది.

ఈ సంవత్సరం కొత్తగా కోర్సు లో జాయిన్ అయిన వారి (1st year) తో పాటుగా గతంలో జాయిన్ అయి కోర్సు లో ఇతర తరగతులు (2nd year & 3rd year & final year) కూడా దరఖాస్తును వెరిఫై చేసుకొని , రెన్యువల్ చేసుకోవాలి.

Related Posts

ఈ తేదిన అన్నదాత సుఖీభవ పథకం 21వ విడత నిధులు జమ
  • adminadmin
  • September 25, 2025

రైతులకు శుభవార్త ! అక్టోబర్ నెలలో వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా లబ్ది చేకురుస్తున్నాయి. ఇందులో…

Read more

Continue reading
AP Vahana Mithra Scheme Apply Process, Required Documents
  • adminadmin
  • September 14, 2025

AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *