
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు (SMART RATION CARDS) పంపిణీ కొనసాగుతోంది. ఆగస్టు నెల 25వ తేదీ నుండి ప్రారంభమైన ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ల పంపిణీ అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది అని గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.
మంత్రిగారు స్మార్ట్ కార్డుల పంపిణీ , రేషన్ పంపిణీ తోపాటు వివిధ అంశాలకు సంబంధించి పలు విషయాలను తెలియజేశారు.
✅ రాష్ట్రంలో మరో కొత్త పథకం , దసరా రోజున 15,000/- జమ – Click here
Table of Contents
🔥 కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ (Ongoing distribution of smart ration cards) :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది.
- ఇప్పటివరకు మొత్తం 80 శాతం లబ్ధిదారులకు రేషన్ కార్డ్లు పంపిణీ చేయబడ్డాయి.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది అని మంత్రి గారు చెప్పారు.
- మొత్తం నాలుగు విడతల గా ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేశారు.
- ఇప్పటికే ప్రతి రేషన్ షాపునకు ఒక సచివాలయం ఉద్యోగిని మ్యాప్ చేశారు. వారు ఇంటింటికి రేషన్ కార్డ్ లను పంపిణీ చేస్తున్నారు.
- గతంలో విడుదల అయిన ఆదేశాల మేరకు రేషన్ కార్డ్లు పంపిణీ ప్రారంభం అయిన 5 రోజులు పాటు సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.
- ఆ తర్వాత మిగిలిపోయిన రేషన్ కార్డులను సంబంధిత రేషన్ షాప్ డీలర్ పంపిణీ చేస్తారు.
🔥 రాష్ట్రంలో గల ప్రతి రేషన్ షాప్ నుండి రేషన్ పంపిణీ :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29762 రేషన్ షాప్ ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నాం అని మంత్రి గారు తెలిపారు.
- రేషన్ డీలర్లు వారి పరిధిలోగల రేషన్ పంపిణీ చేస్తారని , దీనితో పాటుగా పౌరులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకొనే అవకాశం కల్పించామని , ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
✅ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు – Click here
🔥 స్మార్ట్ రేషన్ కార్డులులో తప్పులను ఉచితంగా సరి చేసుకోండి (Correct errors in smart ration cards for free:
- రాష్ట్రంలో పంపిణీ చేయబడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఏమైనా నమోదు అయితే ప్రజలు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి సరి చేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పారు.
- స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు నమోదయి ఉంటే ( పేర్లు , చిరునామా , సంబంధం మొదలగునవి ) వివరాలతో గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని సంప్రదించి తప్పులను సరి చేసేందుకు గాను దరఖాస్తులను నమోదు చేయవచ్చు.
- తప్పులను సరిదిద్దేందుకు గాను ఎవరు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదని , అక్టోబర్ 31 లోపు ఉచితంగా తప్పులను సరిదిద్దుకోవచ్చని మంత్రిగారు తెలిపారు.
- అక్టోబర్ 31 లోపు తప్పులను సరిదిద్దుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉచితంగా (free of charge) మళ్ళీ పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.