
APPSC AEE Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో పనిచేసేందుకు గాను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) (AEE – CIVIL) ఉద్యోగాల భక్తి కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏమిటి ? ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? వంటి వివిధ అంశాల పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ AP ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 APPSC AEE నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)సంస్థ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 APPSC AEE నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- రూరల్ వాటర్ సప్లై మరియు శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE – CIVIL) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేయబోయే మొత్తం APPSC AEE ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ RTC లో 1743 ఉద్యోగాలు – Click here
🔥APPSC AEE అవసరమగు వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు గల అభ్యర్థులుకు అవకాశం ఉంటుంది.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు & దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.
🔥APPSC AEE Qualification (విద్యార్హత వివరాలు):
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. (లేదా)
- ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ సివిల్ సంస్థ వారు నిర్వహించే AMIE పరీక్ష సెక్షన్ – A మరియు section – B నందు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు 250/- రూపాయలు దరఖాస్తు ఫీజుతో పాటుగా 120/- రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టి , బీసీ , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్మెన్ , రేషన్ కార్డు కలిగి ఉన్నవారు , నిరుద్యోగులు వారికి 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులని ఎంపిక చేస్తారు.
🔥 పరీక్షా విధానం :
- ఆబ్జెక్టివ్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఇందులో భాగంగా మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ కు 150 ప్రశ్నలు కి 150 మార్కులు కేటాయించారు. ఒక్కొక్క పేపర్ కి 150 నిముషాల సమయం ఇస్తారు.
- మొత్తం 450 మార్కులు కి అభ్యర్థుల పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్పుల విధానం కలదు.
- పేపర్ – 01 : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ
- పేపర్ – 02 : సివిల్ & మెకానికల్ ఇంజనీరింగ్ (కామన్)
- పేపర్ – 03 : సివిల్ ఇంజనీరింగ్
🔥 పరీక్ష కేంద్రాలు :
- వ్రాత పరీక్షను జ్ఞాపకం విజయవాడలో మాత్రమే నిర్వహిస్తారు.
🔥 జీత భత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 57,100/- నుండి 1,47,760/- రూపాయల బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి..
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 18/09/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 08/10/2025