స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వ తేదీ నుండి “స్త్రీ శక్తి ” పథకాన్ని ప్రారంభించింది.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు , ఉప ముఖ్యమంత్రి శ్రీ కోనిదెల పవన్ కళ్యాణ్ గారు , విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మొదలగు వారు ఈ స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

వీరందరూ ఉండవల్లి నుండి విజయవాడ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.

ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీ శక్తి పథకం యొక్క పూర్తి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

🔥 ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీ శక్తి పథకం :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పటినుండో వేచి చూస్తున్న , సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి స్వాతంత్ర దినోత్సవం నుండి ప్రారంభించింది.
  • ఉద్యోగాల కొరకు , ఉపాధి కొరకు , కూలి పనుల కొరకు వెళ్లే మహిళలు ఉచితంగా ఎటువంటి ఖర్చు చేయకుండా ప్రయాణించవచ్చని , మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పేర్కొన్నారు.

🔥 ఈ ఐదు రకాల బస్ లలో ప్రయాణం పూర్తి ఉచితం :

  • రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ఇప్పటికే జీవో విడుదల చేయడం జరిగింది.
  • జీవో లో ప్రస్తావించిన విధంగానే క్రింద పేర్కొన్న ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అవి :
  • 1. పల్లె వెలుగు బస్ లు
  • 2. అల్ట్రా పల్లె వెలుగు బస్ లు
  • 3. సిటీ ఆర్డినరీ బస్ లు
  • 4. ఎక్స్ ప్రెస్ బస్ లు
  • 5. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ లు
  • ఈ బస్ లలో మహిళలు ఉచితంగా ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు , జిల్లాలు మారినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందు కొరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

🔥 ఉచిత బస్సు ప్రయాణం పథకం కొరకు 8,548 బస్ లను కేటాయించిన ప్రభుత్వం :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి సంబంధించి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు , వారి ప్రయాణం సౌకర్యవంతంగా సుఖవంతంగా ఉండేందుకు , మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్న మొత్తం 11,449 బస్ లలో 8,458 బస్ లను ఈ పథకం కొరకు కేటాయించారు.
  • రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని బస్సులు కూడా కండిషన్ లో ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా , దర్జాగా ప్రయాణించేలా చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదేశించారు.

🔥 జీరో ఫేర్ టికెట్ & రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ :

  • మహిళలు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని వినియోగించుకునేటప్పుడు వారు జీరో ఫెయిర్ టికెట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ జీరో ఫైర్ టికెట్ లో స్త్రీ శక్తి పథకం లబ్దిదారు ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రయాణిస్తున్నారు మరియు మొత్తం టికెట్ ధర ఎంత ? ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ వివరాలు వంటివి ప్రస్తావించబడి వుంటాయి.
  • మహిళల భద్రత దృశ్యా బస్ లను సెల్ ఫోన్ లోని ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

🔥 ఉచిత బస్ ప్రయాణం కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :

  • స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్ లలో ఉచితంగా ప్రయాణించేందుకు గాను మహిళలు గుర్తింపు కార్డ్ లను చూపించవలసి వుంటుంది. జిరాక్స్ కాపీలకు అనుమతి లేదు.
  • మహిళలు ఆధార్ కార్డు , రేషన్ కార్డ్ , ఓటర్ ఐడి కార్డ్ మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము ద్వారా గుర్తింప బడిన ఏదైనా గుర్తింపు కార్డ్ ను చూపించవచ్చు.
  • గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలు మరియు సాఫ్ట్ కాపీ లను కూడా అనుమతించే అంశము పై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.

🔥 ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం :

  • స్త్రీ శక్తి పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురు అవుతాయి అన్న అంశము పరిశీలిస్తున్నాం అని , ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గారు అన్నారు.
  • వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని , ఆటో డ్రైవర్లకు సహాయం చేయనున్నారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని ప్రకటించారు.

🔥 స్త్రీ శక్తి పథకం పై ముఖ్యమంత్రి గారి సమీక్ష :

  • స్త్రీ శక్తి పథకం ను ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు పథకం అమలు పై సమీక్ష నిర్వహించారు.
  • గుర్తింపు కొరకు ఆధార్ జిరాక్స్ కాపీ ల వినియోగం మరియు మొబైల్ ఫోన్ లో సాఫ్ట్ కాపీ లను గుర్తింపు కార్డ్ లుగా ఉపయోగించడం పై అనుమతి అంశాన్ని పరిశీలిస్తున్నారు.
  • ఇప్పటి వరకు 12 లక్షల మంది మహిళలకు పైగా ఉచిత బస్ ప్రయాణం ను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
  • వచ్చే సోమవారం నుండి అధికంగా మహిళలు ఉచిత బస్ ప్రయాణం ను వినియోగించుకోనున్నారు అని తెలుస్తుంది.
  • ఘాట్ రోడ్ లలో కూడా ఉచిత బస్ ప్రయాణం ను అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

🔥ఉచిత బస్ ప్రయాణం ట్రాన్స్ జెండర్ ల కూడా :

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం రాష్ట్రంలో ఉన్న అందర మహిళలతో పాటుగా ట్రాన్స్ జెండర్లు కూడా ఉపయోగించుకోవచ్చు.
  • ట్రాన్స్ జెండర్లు కూడా మహిళల వలే ఎటువంటి పరిమితులు లేకుండా స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.
  • వీరితో పాటుగా రాష్ట్రంలో ఉన్న స్కూల్ విద్యార్థులకు కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

Related Posts

ఈ తేదిన అన్నదాత సుఖీభవ పథకం 21వ విడత నిధులు జమ
  • adminadmin
  • September 25, 2025

రైతులకు శుభవార్త ! అక్టోబర్ నెలలో వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా లబ్ది చేకురుస్తున్నాయి. ఇందులో…

Read more

Continue reading
AP Vahana Mithra Scheme Apply Process, Required Documents
  • adminadmin
  • September 14, 2025

AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *