అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ నమోదుకు ఆగస్టు 25 చివరి తేదీ | తప్పనిసరిగా ఇలా చేసుకోండి.

అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ నమోదుకు ఆగస్టు 25 చివరి తేదీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కొరకు గత ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) పథకం తో పాటుగా అరెస్టు 2వ తేదీ నుండి అమలు చేసింది.

అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి వివిధ కారణాల చేత నగదు జమ కాని వారికి , గ్రీవెన్స్ నమోదు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హత కలిగి ఉండి , నగదు జమ కాని వారు ఈ నెల 25వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలి.

ఈ గ్రీవెన్స్ నమోదు విధానం పై మరింత సమాచారం అనగా గ్రీవెన్స్ ఎక్కడ నమోదు చేసుకోవాలి ? అవసరమగు ధృవ పత్రాలు ఏమిటి ? మొదలగు వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥రైతులకు వరం – అన్నదాత సుఖీభవ :

  • అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తేదీన ప్రారంభించింది.
  • ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గల రైతుల అందరికీ ప్రత్యక్ష నగదు సహాయం అందిస్తారు.
  • ఈ పథకం ప్రధానంగా రైతులు పంట సాగు చేసే సమయంలో పెట్టుబడి సాయంగా లభిస్తుంది.
  • రైతులు పంట సాగు చేసే సమయంలో పెట్టుబడి సహాయం అందించడం వల్ల రైతులకు వారు పంటపై పెట్టే ఖర్చుపై ఉపశమనం లభిస్తుంది.
  • ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ తో పాటుగా అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రైతుల సంక్షేమం కొరకు 20వేల రూపాయలు అందిస్తున్నారు.

🔥 అన్నదాత సుఖీభవ పథకం లక్ష్యాలు :

  • ఈ పథకం ద్వారా రైతులకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు.
  • రైతులకు సకాలంలో నగదు జమవుతుంది.
  • ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఉత్పాదికత ను పెంచవచ్చు.
  • ఈ పథకం ద్వారా CCRC (క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డ్) కలిగి వున్న కౌలు రైతులు కి కూడా లబ్ది చేకూరుతుంది.
  • రైతులకు ఎరువులు , పంటల సాగు ఖర్చుల భారం తగ్గడం తో పాటు గా రైతుల సంక్షేమాన్ని పెంచవచ్చు.
  • రైతులకు పంటల సీజన్ కి ముందే డబ్బుకు జమ చేయడం ద్వారా వారిని సంస్థాగత , సంస్థాగతేతర రుణాలు , అప్పుల బారి నుండి తప్పించవచ్చు.

🔥 అర్హత కలిగిన వారు ఈ విధంగా గ్రీవెన్స్ నమోదు చేసుకోండి :

  • అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి ఇంకా డబ్బులు జమ కాని వారు గ్రీవెన్స్ నమోదు చేసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
  • ఇందులో భాగంగా అర్హత కలిగిన ఎవరైనా లబ్ధిదారులకు నగదు జమ కానిచో వారు ఆగస్టు 25వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • గ్రీవెన్స్ నమోదు చేసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గల రైతు సేవా కేంద్రాన్ని సందర్శించాలి.
  • రైతు సేవ కేంద్రంలో గల గ్రామ వ్యవసాయ సహాయకులు కి మీరు గ్రీవెన్స్ అందజేయవచ్చు.
  • ముందుగా మీ యొక్క ఆధార్ నెంబర్ తో గ్రామ వ్యవసాయ సహాయకులు సంప్రదించి అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ లో తెలుసుకోండి.
  • అన్నదాత సుఖీభవ పథకం యొక్క స్టేటస్ ను తెలుసుకున్న తర్వాత గ్రామ వ్యవసాయ సహాయకులు వారు మీకు ఎందుకు నగదు జమ కాలేదో సంబంధిత కారణాలు తెలియజేస్తారు.
  • ఆ తర్వాత సమస్యకు సంబంధించి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు.
  • ఒకవేళ సంబంధిత గ్రీవెన్స్ వివరాలు పై అధికారులకు చేరవేయాల్సి ఉన్నచో అధికారి తమ లాగిన్ లో గ్రీవెన్స్ నమోదు చేసి పై అధికారులకు వెరిఫికేషన్ ప్రభుత్వం పంపిస్తారు.
  • గ్రీవెన్స్ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత , సంబంధిత గ్రీవెన్స్ నమోదుదారులు అన్నదాత సుఖీభవ పథకానికి నిజంగా అర్హులైతే వారికి నగదు జమ అవుతుంది.
  • వచ్చే అక్టోబర్ నెలలో మీ అందరికీ కూడా నాకు జమ అవుతుందని తెలుస్తుంది.

🔥 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోండి ఇలా :

  • అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు తమ పధకం యొక్క స్టేటస్ ను ఆన్లైన్ లో చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. స్టేటస్ ను తెలుసుకునేందుకు రైతులు అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
  • వెబ్సైట్లో ” Know your Status ” పై క్లిక్ చేసి , ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • సబ్మిట్ చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులా కాదా ? ఈ కేవైసీ పూర్తయిందా లేదా ? నగదు జమ అయిందా లేదా ? లేదా ప్రాసెసింగ్ లో ఉందా అని అంశాలు అందులో డిస్ప్లే కాబడతాయి. దీనితో పాటుగా ఒకవేళ అనర్హత కలిగి ఉంటే ఏ కారణం చేత అనర్హత కలిగి ఉన్నారు అనే అంశాన్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది.

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి , వివిధ కారణాల చేత నగదు జమ కాని వారు వీలైనంత త్వరగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలో గల రైతు సేవా కేంద్రంలో గల వ్యవసాయ సహాయకులను సంప్రదించి గ్రీవెన్స్ నమోదు చేసుకొని , ఈ పథకం యొక్క లబ్ది ను పొందగలరని ఆశిస్తున్నాము.

Related Posts

ఈ తేదిన అన్నదాత సుఖీభవ పథకం 21వ విడత నిధులు జమ
  • adminadmin
  • September 25, 2025

రైతులకు శుభవార్త ! అక్టోబర్ నెలలో వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా లబ్ది చేకురుస్తున్నాయి. ఇందులో…

Read more

Continue reading
AP Vahana Mithra Scheme Apply Process, Required Documents
  • adminadmin
  • September 14, 2025

AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *